34వ వార్డు ప్రజలు బిఆర్ఎస్ వైపే.
👉మాజీ ఎమ్మెల్యే పైలట్ నాయకత్వంలో మున్సిపల్ పీఠం కైవసం
👉 పటేల్ సుప్రీతా కరుణాకర్
నేటి ఇజం :తాండూరు :: రానున్న తాండూరు మున్సిపల్ ఎన్నికలలో 34 వ వార్డు ప్రజల ఆశీర్వాదం బిఆర్ఎస్ పార్టీ వైపే ఉందని బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పటేల్ సుప్రీతా కరుణాకర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలో రానున్న మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు..
అలాగే గత అసెంబ్లీ ఎన్నికలలో అమలుకు సాధ్యం కానీ అసాధారమైన తప్పుడు హామీలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు తగిన జవాబు ఇస్తారని ఎద్దేవా చేశారు.

