వార్డు నం 15లో దివిటి ఆర్థిక సహాయం
👉పేద మహిళ అంత్యక్రియలకు ₹3వేల ఆర్థిక సహాయం
👉 కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు
నేటి ఇజం తాండూరు : పాత తాండూరు పట్టణంలోని వార్డ్ నెంబర్ 15 లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటమ్మ అనే కూలి మహిళ మృతి చెందింది. విషయం తెలుసుకున్న వార్డ్ నెంబర్ 15 కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దివిటి ఎల్లప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు ₹3000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినట్లు కాలనీ ప్రజలు తెలిపారు. నిరుపేద మహిళ అంతక్రియలకు ఆర్థిక సహాయం అందించడం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేష్, శివకుమార్, శ్రీనివాస్, గజ్జలప్ప మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.

