వార్డు నం 05 లో సమియోద్దీన్ పోటీ?
👉 మైనార్టీ హక్కుల పోరాట సమితిలో కీలక సేవలు
👉 గత కొన్ని సం”లుగా బిఆర్ఎస్ లో చురుకైన పాత్ర
👉 రోహిత్ అన్న ఆశీర్వాదం నాకే?
👉బిఆర్ఎస్ నాయకులు సమియోద్దీన్
నేటి ఇజం తాండూరు: రానున్న తాండూరు మున్సిపల్ ఎన్నికలలో ఇందిరానగర్ వార్డు నెంబర్ 05 నుండి బిఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని బిఆర్ఎస్ నాయకులు సమియుద్దీన్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా సమియోద్దీన్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రోహిత్ అన్న ఆదేశానుసారం బిఆర్ఎస్ పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా సేవలు అందించానని అన్నారు. అలాగే రాష్ట్ర మైనార్టీ హక్కుల పోరాట సమితి తాండూరు నియోజకవర్గ ఇన్చార్జిగా పట్టణ మైనార్టీ హక్కుల కోసం కృషి చేసినట్లు తెలిపారు. ఇందిరానగర్ వార్డు నెంబర్ ఐదులోని ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని…. అవకాశం కల్పిస్తే వార్డు సభ్యులకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు.

