నూతన బిషప్ ఎసిమోన్ కు ఘన సన్మానం
👉హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
👉 తెలంగాణ మెథడిస్ట్ సంఘంలో పెద్దన్న పాత్ర
👉 క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ వి. కిరణ్
నేటి ఇజం తాండూరు: శుక్రవారం తాండూరు పట్టణంలో తాండూరు నియోజకవర్గం బిషప్ ఎ.సిమోన్ ను నూతనంగా ఎన్నుకోవడం జరిగిందని తాండూరు క్రిస్టియన్ మైనార్టీ ప్రెసిడెంట్ వి కిరణ్ అన్నారు.బిషప్ ఎ.సిమోన్ తెలంగాణ మెథడిస్ట్ సంఘాలకు ఆయన అన్నిటిలో పెద్ద ఉండి ఉంటూ సంఘానికి పెద్దన్న పాత్ర పోషించారని తెలిపారు. బిషప్ పదవిలో తాండూరు నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్ వి. కిరణ్ ఆధ్వర్యంలో బిషప్ ఎసిమోన్ ను ఘనంగా శాలువాలతో సత్కరించి పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో.డిస్టిక్ సుపరిండెంట్ జనార్ధన్,మధుసూదన్ రెడ్డి, వెంకటరెడ్డి పటేల్, కోటపల్లి అంజయ్, శంకర్,భీమయ్య, గోపాల్,శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.

